03-06-2025 12:58:56 AM
తుర్కయంజాల్, జూన్ 2; మున్సిపాలిటీలో జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు వంద రోజుల ప్రణాళికను అమలు చే యాలని భుత్వం నిర్ణయించిందని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సంబంధించి తుర్కయంజాల్ చౌరస్తా నుంచి మసాబ్ చెరువు బుద్ధ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం,మంచినీటి సరఫరా,వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్ సిబ్బందికి హెల్త్ క్యాంప్ లు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించటం, ప్లాస్టిక్ నియంత్రణ, రెవిన్యూ రాబడి పెంచుకోవటం, వీధి కుక్కల నియంత్రణ, వనమహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది.
వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలన్నారు. పారిశుధ్యం, మౌ లిక సదుపాయాల కల్పన, ఆర్థికా భివృద్ధి తడి, పొడి చెత్త వేరు చేయు టకు శ్రీకారం చుట్టాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా చెట్లు నాటుట, పరిసరాల పరిశుభ్రత బహిరంగ ప్ర దేశాల్లో మలమూత్ర విసర్జన చేయ కుండా పబ్లిక్ టాయిలెట్స్ వాడాల న్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, డిఈ బిక్షపతి ఏఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్వో శ్రీనివాస్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, మున్సిపాలిటీ అధికారులు బాలరాజ్ , బిల్ కలెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.