బీజింగ్: థామస్ కప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. శనివారం గ్రూప్ థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4 తో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్.. థాయ్లాండ్ షట్లర్ విటిద్సర్న్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం డబుల్స్ మ్యాచ్లో భారత టాప్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి 21 సుక్ఫున్ జంటపై విజయం సాధించి 1 స్కోరును సమం చేసింది. అనంతరం మరో సింగిల్స్లో లక్ష్యసేన్ తీరరత్సకుల్పై 21 19 21 విజయం సాధించడంతో భారత్ 2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మరో డబుల్స్లో అర్జున్ జోడి.. పున్పనిచ్. సోతోన్ను 21 21 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. ఆఖరి సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్.. సారన్ జామ్ శ్రీని 21 21 ఓడించడంతో భారత్ 4 తిరుగులేని విజయాన్ని అందుకుంది.