18 April, 2026 | 1:03 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్ర‌మాదం

01-04-2025 11:26 PM

గుర్రంపోడు: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ స్కార్పియో ప్ర‌యాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లి ప‌ల్టీకొట్టింది. న‌ల్ల‌గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ శివారులో మంగ‌ళ‌వారం ఈ ఘటన జరిగింది. గుర్రంపోడులోని ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహ‌నం అదుపుత‌ప్పి రోడ్డు వెంట ఉన్న‌ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు వ‌చ్చాయి. కారులోని ఇద్ద‌రికి స్వ‌ల్ప‌గాయాలైన‌ట్లు తెలిసింది. ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.