11-06-2025 07:34:36 PM
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లందు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు చెక్కు బోన్స్ కేసులో ముద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించిన విషయాన్ని మెజిస్ట్రేట్ కీర్తి చంద్రిక రెడ్డి(Magistrate Keerthi Chandrika Reddy) వెల్లడించారు. ఇల్లందు పట్టణానికి చెందిన కొమురవెల్లి సాహితీ రాణి, భర్త సురేష్ ఇల్లందు నివాసి వద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న కొండూరి ఉదయభాస్కర్ ఆ బాకీనీ చెల్లించే నిమిత్తంలో తను 4 లక్షల రూపాయలకి సంబంధించి తను చెక్కు రాసి ఇవ్వడం జరిగింది. తను ఇచ్చిన యూనియన్ బ్యాంకు చెక్ నెంబర్ 716577 గల చెక్కును బ్యాంకులో చెల్లించుకొనుటకు కొమురవెల్లి సాహితీ రాణి బ్యాంకుకు వెళ్లగా ఆ చెక్కు బౌన్స్ అయినది.
ఈ విషయంలో కొమురవెల్లి సాహితీ రాణి తనకు జరిగిన అన్యాయాన్ని ఇల్లందు కోర్టులో తన లాయర్ అయినటువంటి తాడూరి మహేష్ ద్వారా చెక్ బౌన్స్ కేసును కొండూరు ఉదయ భాస్కరరావు పైన కేసు నెంబర్ 97/2019 నాడు కేసు వేయగా ఈ కేసు నందు ఇల్లందు కోర్టులో తగిన సాక్షాలను విచారించి బుధవారం ముద్దాయి అయినా కొండూరి ఉదయభాస్కర్ కు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు నాలుగు లక్షలు చెల్లించవలసిందిగా తెలియజేస్తూ తను చేసిన నిర్లక్ష్యానికి తక్షణమే పదివేల రూపాయలు ఫైన్ కూడా విధిస్తూ తన అమూల్యమైన తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ముద్దాయి తరుపున న్యాయవాదులుగా కే నాగేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావులు వాదించారు.