27-06-2025 11:33:10 PM
మంథని,(విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా నియమించబడిన న్యాయవాది బండ మాధురిని శుక్రవారం మంథని కోర్ట్ కాంప్లెక్స్ లో మంథని న్యాయ వాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ మంథని ఉప అధ్యక్షుడు రగోత్తం రెడ్డి, సింగరేణి అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, మంథని బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్, వైశ్య సంఘా న్యాయ సలహాదారు రాజేందర్, ప్రభుత్వ న్యాయవాది ఆంజనేయులు, సీనియర్ న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, క్రీడలు సంస్కృతిక కార్యదర్శి అంబేద్కర్ సంఘ నాయకుడు ఆర్ల నాగరాజు, న్యాయవాది శ్రీమతి భాగ్య, మచ్చుపెటకు చెందిన న్యాయవాది సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ హరి బాబు, సహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచజేశారు.