27-06-2025 11:25:12 PM
హైదరాబాద్: ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. స్వేచ్ఛ అనే యువతి ఓ టీవీ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తుంది. ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో ఉండేది. శుక్రవారం సాయంత్రం స్వేచ్ఛ జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. రామ్ నగర్ లో నివాసం ఉంటుండగా.. జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే అనుమానాలు చోటు చేసుకున్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.