13 June, 2026 | 2:54 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:26 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి) కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు .  పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా,  దీక్ష భూమిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,చైర్మన్   షాహిన్ సుల్తానా, వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఏటుకూరి శ్రీనివాసరావు, సునార్కర్ అనిల్ కుమార్ PRTU TS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, విద్యావేత్త, బిఆర్ అంబేద్కర్ అని ,భారతదేశంలో వివిధ చట్టసభలకు రాజ్యాంగమే దిక్సూచిగా పనిచేస్తుందని, గ్రామ పరిపాలన వ్యవస్థ నుంచి దేశ పరిపాలన వ్యవస్థ వరకు రాజ్యాంగ స్ఫూర్తితో నిర్వహిస్తామని, బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం సూచించిన విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని , ఇంకో వెయ్యి సంవత్సరాల వరకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు .