calender_icon.png 10 February, 2026 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్కనూర్ పీహెచ్‌సీలో అమ్మ ఒడికి కార్యక్రమం

10-02-2026 04:47:08 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం సమగ్రంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలను పీహెచ్‌సీకి తీసుకువచ్చి రక్తపరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు వంటి కీలక వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పోషక విలువలు, జాగ్రత్తలపై డాక్టర్ దివ్య అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, ఎంఎల్‌హెచ్‌పి పూజ, హెల్త్ అసిస్టెంట్లు హేమలత, యశోద పాల్గొని సేవలందించారు. గర్భిణీ ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.