calender_icon.png 19 June, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి

19-06-2025 12:16:17 AM

అంగన్వాడీ కేంద్రాల్లో సంక్షేమ శాఖ పని తీరుపై సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూన్-18 (విజయ క్రాంతి): జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంక్షేమ శాఖ పని తీరు పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

టాయిలెట్ లేని అంగన్ వాడి కేంద్రాల జాబితా సిద్దం చేసి వెంటనే టాయిలెట్స్ నిర్మించాలని, అవ సరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, ఎంపిడిఓ లతో సమన్వయం చేసుకుంటూ అంగన్వాడి సెంటర్ లను శుభ్రం చేసుకోవాలని, అం గన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు రాబోయే 6 నెలల కాలంలో అక్షరాలు, సంఖ్యల గుర్తింపు, రాయడం వంటి అంశాలలో పురోగతి రావాలని, పూర్వ ప్రాథమిక విద్య గురించి ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

ఎత్తు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించాలని ఎక్కడ దాచాల్సిన అవసరం లేదని, సరైన రిపోర్ట్ లను అందించాలని,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు సంబంధిత పౌష్టికాహారం తప్పనిసరిగా అందేలా చూడాలని,సఖీ సెంటర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లల రికార్డులు పకడ్బందీగా మెయింటైన్ చేయాలని, అంగన్వాడీ తర్వాత వారు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సంబంధిత అధికారులు, తదితరులుపాల్గొన్నారు.