19-06-2025 12:16:34 AM
అనుమతికి మించి బెడ్లు.. స్థాయికి మించి వైద్యం
కింది స్థాయి అధికారుల ఉదాసీనత
జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు
నాగర్ కర్నూల్ జూన్ 18 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డు అదుపు లేకుండా ఇష్టరాజ్యంగా స్థాయికి మించిన వైద్యం చేస్తూనే పేద రోగుల నుంచి అడ్డగోలుగా డబ్బు దం డుకుంటున్నారు. కనీస అవగాహన అర్హత లేకపోయినా డబ్బు సంపాదనే లక్ష్యంగా అ వసరం లేకపోయినా ప్రమాదకర స్థాయిలో యాంటీబయాటిక్ మందులను వాడుతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా వెలిసిన ఆర్ఎంపి, పి.ఎం.పి ఆసుపత్రుల నుంచి మండల, పట్టణ కేంద్రాల్లో కార్పొరేట్ స్థా యిలో నెలకొల్పిన ఆసుపత్రులకు రోగులను మళ్లిస్తూ కమిషన్ బేరం కుదుర్చుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నారని జిల్లాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టుల నుండి ఆపరేషన్ అయ్యేదాకా అన్నిట్లోనూ కమిషన్ కోసం పేద రోగుల ప్రాణాలను బే రం పెడుతున్నారు.
కనీసం రోగి బరువు, వయస్సుతో సంబంధం లేకుండా ప్రమాదకరమైన డ్రగ్ మందులను వినియోగించడం తో ఉన్న రోగాన్ని తగ్గించుకోవడం దేవుడెరుగు కొత్త రోగాలు కొని తెచ్చుకునే పరిస్థితి దాపురించిందని రోగులు మండిపడుతున్నా రు. మరి కొంతమంది ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం 24 గంటలు అందుబాటు లో ఉంటామని ప్రకటనలు చేస్తూ తమ బోర్డులపై రాతలు రాస్తూ రాత్రి ఎనిమిది గంటలు దాటిందంటే హైదరాబాద్, మహబూబ్నగర్ వంటి పట్టణాలకు పరుగులు పెడుతున్నారు.
దీంతో కిందిస్థాయి సిబ్బంది చేత వీడియో కాల్ ద్వారా వైద్యం చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రు. కన్సల్టెన్సీ పేరుతో ఒక్కో రోగి నుంచి వేళ ల్లో దండుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ఆర్ఎంపి, పిఎంపి స్థాయి వైద్యులు ఎంబిబిఎస్, ఎండి అంటూ స్పెషలిస్ట్ పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసుకొని స్థాయికి మించిన వైద్యం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
మరికొ న్ని ఆస్పత్రుల్లో గర్భిణీ, బాలింతలు శిశు మరణాలు నిత్య కృత్యంగా జరుగుతున్నా ఎలాంటి ఫిర్యాదు అందకుండా లోలోపలే సెటిల్మెంట్ చేసుకుంటూ కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు కూడా ముట్టజెప్పి వైద్య రంగాన్ని వ్యాపార కోణం లో నడుపుతున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రోగికి కుట్టు కోతలు లేకుండా లాప్రోస్కోపీ పద్ధతిలో ఆపరేషన్ అంటూ కొత్త దందాకు తెర లేపుతున్నట్లు ఆరోపణలు వెళ్ళువెత్తుతున్నాయి.
ఒక్కో ఆసుపత్రి లో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకులు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు సుమారు 50 నుంచి 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచా రం జరుగుతుంది. ఇలా జిల్లా కేంద్రంలోని అన్ని ఆసుపత్రిలో రోగులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా మారి ఏళ్లు గడుస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అర్హత లేని ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఇతర ఉన్నత స్థాయి వైద్యులు మండిపడుతున్నారు.
గర్భం దాల్చి న మహిళ పురుడుపోసుకోవాలంటే సుమా రు 50 నుండి లక్షల రూపాయల వరకు గు మ్మడించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అర్హత లేని ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసి మూడు నుంచి ఐదువేల వరకు దండుకుంటున్నారని లింగ నిర్ధారణ పరీక్షలకు 10వేలు ధర నిర్ణయించి వసూలు చేస్తున్న ట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని ఆసుపత్రులు పై అంత స్తులో ఏర్పాటు చేసినా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 165 ప్రైవేటు ఆస్పత్రులు అనుమతులు పొందినప్పటికీ వాటిల్లో అనుమతులు మించి ఇరుకిరుకు గదుల్లో బెడ్లు ఏ ర్పాటు చేసుకొని బ్లడ్ చార్జీల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని రోగులు మం డిపడుతున్నారు.
ఇతర వైద్యుల పేరుతో అనుమతులు పొందిన ఆసుపత్రుల్లో వారు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినప్పటికీ అ దే పేర్లతో అర్హతలేని వారి చేత వైద్యం అందిస్తూ డబ్బు సంపాదన లక్ష్యంగా పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం వర్షా కాలం సీజనల్ వ్యాధులు విధులుంబిస్తున్న తరుణంలో తరచు ప్రైవేటు ఆసుపత్రులు ఆర్.ఎం.పి పి.ఎం.పి వాటిపై పర్యవేక్షించాల్సిన అధికారులు చాలా కాలంగా ఇక్కడే తీసినవేసి ఉండడంతో వారిచ్చే నెల మా మూళ్లకు అలవాటు పడి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రులకు అనుసంధానంగా నడిచే డ యాగ్నొస్టిక్ సెంటర్లలో కనీస అర్హత లేని వారు చేసే టెస్టుల ఆధారంగా వైద్యం చేయ డం ఆందోళన కలిగిస్తుందని, అవసరం లేకపోయినా ప్రతి వైద్యుడు టెస్టులు రాస్తూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారని మండిపడుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం...
ఆర్.ఎం.పి, పి.ఎం.పి ప్రైవేటు ఆసుపత్రులు సైతం నిబంధన లను తూచా తప్పకుండా పాటించా ల్సిందే లేదంటే జి ల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చట్టపరిమినమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ ధ్రువపత్రాలు పొందుపరిచి అర్హత పొం దిన ఆసుపత్రులు వైద్యుల చిట్టా కూడా పరిశీలిస్తున్నాం. డబ్బు సంపాదన ల క్ష్యంగా ఆస్పత్రులు నడిపితే ఇకపై ఊరుకునేది లేదు.
డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, వైద్యాధికారిణి, నాగర్కర్నూల్