19-06-2025 12:13:36 AM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 18 (విజయ క్రాంతి) : ఉపాధ్యాయుని చేతుల్లో దేశ నిర్మాణం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఏనుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ ఉపా ద్యాయురాలు అజిత పదవీ విరమణ మహోత్సవానికి, ఈనెల 26వ తేదీన నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ, ఇటీవల రాష్ట్ర టీపిసిసి ప్రధాన మిథున్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ను కలిసి శాలువా పూలమాలతో ప్రత్యేకంగా మిథున్ రెడ్డి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మా ట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ఏ రంగంలో అయినా ఉన్నత స్థాయికి చేరుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, అంజయ్య గౌడ్, రఘురామిరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ నగరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గా రు పిలుపునిచ్చారు. టి పిసిసి ప్రధాన కార్యదర్శి గా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎపి మిథున్ రెడ్డి బుధవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మిథున్ రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.