calender_icon.png 14 October, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య

14-10-2025 04:07:15 PM

హర్యానా: రోహ్‌తక్ రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఐజీ కార్యాలయంలోని సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ రోహ్‌తక్‌లోని తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని అధికారులు పేర్కొన్నారు. ఆ నోట్‌లో ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పోస్ట్ చేయబడిన ఏఎస్ఐ సందీప్ నాలుగు పేజీల సూసైడ్ నోట్, ఒక వీడియో కూడా తీశాడు. ఏఎస్ఐ ఆత్మహత్య లేఖలో ఐపీఎస్ వై.పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. పూరన్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ బృందంలో సందీప్ కూడా ఒకరు. నోట్‌లో, అతను పురాణ్ కుమార్‌ను అవినీతిపరుడిగా పేర్కొన్నాడు. అరెస్టు భయంతోనే వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఐపీఎస్ అధికారి కులతత్వాన్ని ఉపయోగించుకుని వ్యవస్థను హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. మృత్యుడి చివరి డిమాండ్ ఏమిటంటే, "నా ప్రాణాలను త్యాగం చేసి దర్యాప్తు చేయాలని, నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవినీతి కుటుంబాన్ని వదిలిపెట్టకూడదని సందీప్ లేఖలో వివరించారు.