5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

కేసులు ఎదుర్కొనేందుకు రెండు న్యాయసంస్థల నియామకం

21-01-2025 12:39 AM

న్యాయపోరాటానికి అదానీ గ్రూపు సిద్ధం

ముంబై: దిగ్గజ సంస్థ అదానీ గ్రూపు ఇటీవల అమెరికాలో తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయింది. ఈ మేరకు సెక్యూరి టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్‌క్లాండ్ అండ్ ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ అండ్ సుల్లివాన్ ఎల్‌ఎల్‌పీ అనే రెండు న్యాయసంస్థలను అదానీ గ్రూపు నియమించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అమెరికాలోని ఎస్‌ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక విచరణ జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కోవడానికి అదానీ గ్రూపు తాజాగా ఈ రెండు సంస్థలను నియమించింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలపై ఇవి న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానాలు చెప్పనున్నాయి.