షాద్నగర్ నియోజకవర్గంలో సింగిల్ విండో చైర్మన్ల నియామకం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానం
షాద్నగర్,(విజయక్రాంతి): షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల సింగిల్ విండో సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం పూర్తయింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన చైర్మన్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.చేగురు సొసైటీ పసుల బుచ్చయ్య, నందిగామ మండలం సింగిల్ విండో కుందారం వెంకటరెడ్డి, మేకగూడ సొసైటీ అంబటి ప్రభాకర్, కొందుర్గు మండలం జితేందర్ రెడ్డి, కేశంపేట్ మండలం యన్నం శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సమర్థులైన నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించింది. నూతన చైర్మన్లు సహకార సంఘాల అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు.నియోజకవర్గంలోని అన్ని సహకార సంఘాలకు చైర్మన్ల నియామకం పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.






