1 April, 2026 | 11:57 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ ఆక్వా రంగం: సీఎం చంద్రబాబు

18-02-2025 08:54 PM

ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

విజయవాడ: జిఎఫ్‌ఎస్‌టి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన  ఆక్వా టెక్ 2.0 కాన్ క్లేవ్ (Aqua Tech 2.0 Conclave)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ఆక్వా రంగం.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగంతో 30 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతిసాగు ఆక్వా ఉత్పత్తులకు(AQUA Products) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని సీబీఎన్(CBN) సూచించారు. సీడ్, ఫీడ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి.. యాంటీబయోటిక్స్ ను తగ్గించాలని సీఎం చంద్రబాబు(Chandrababu) సూచించారు. ఆక్వారంగం.. 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం దిశగా ప్రోత్సహిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాలుష్యం లేని ఆక్వా దిశగా రైతులు, వ్యాపారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.