calender_icon.png 16 June, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు అని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

15-06-2025 10:42:24 PM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

కోదాడ: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం(MLA Padmavathi Uttam) అన్నారు. ఆదివారం స్థానిక గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా మంత్రి ఉత్తంతో పాటు తనకు ఆర్యవైశ్య సంఘాలతో విడదీయని అనుబంధం ఉందని ఆత్మీయ భావాన్ని వ్యక్తం చేశారు. తమ ఇంటి ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్నారన్నారు. ఆర్యవైశ్య సేవ స్ఫూర్తి సమస్త లోకానికి ఆదర్శమని కొనియాడారు.

అనంతరం నూతన అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తో పాటు కార్య వర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, మహిళా విభాగంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలుగా  గరినే ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి, కోశాధికారిగా వెంకటలక్ష్మి తోపాటు కార్యవర్గాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, జిల్లా రాజకీయ విభాగ చైర్మన్ కక్కిరిని శ్రీనివాస్ మీడియా విభాగ చైర్మన్ వంగవీటి శ్రీనివాసరావు ఎన్నారై విభాగం చైర్మన్ ఇరుకుల చెన్నకేశవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు లచే ఇరుకుల్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా బొమ్మిడి అశోక్, ప్రధాన కార్యదర్శిగా చల్ల అశోక్, కోశాధికారిగా స్వామి గణేష్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ భరత్ చంద్ర, ఇమ్మడి అనంత చక్రవర్తి, భరత్ ,సాయి, ప్రవీణ్ లచే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత పాల్గొన్నారు.