25-06-2025 12:13:49 AM
రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజాచిత్రం ‘కూలీ’. రజనీకాంత్ కెరీర్లో 171వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్పిక్చర్స్ బ్యానర్పై కళానిధిమారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నటులు నాగార్జునతోపాటు ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శ్రుతిహాసన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ కనగరాజ్. ఆయన ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రానికి హిందీలో టైటిల్ను మారింది. హిందీలో ఈ సినిమాను మజ్దూర్ అనే పేరుతో తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. మజ్దూర్ అంటే హిందీలో కార్మికుడు అని అర్థం.
అయితే, ‘కూలీ’ అనే అసలు టైటిల్ బాగానే ఉన్నప్పటికీ పేరు మార్చడంపై చాలా మంది అభిమానులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ మార్చడానికి కారణం.. గతంలో ఇదే టైటిల్తో హిందీలో సినిమాలు రావడమే కారణమని స్పష్టమవుతోంది. అమితాబ్ బచ్చన్ ‘కూలీ’ (1983), గోవిందా ‘కూలీ నెం.1’ (1995), వరుణ్ ధావన్ ‘కూలీ నెం.1’ (2020) వంటి చిత్రాల కాపీరైట్ సమస్యల కారణంగానే రజనీకాంత్.. హిందీ ప్రేక్షకుల ముందుకు ‘మజ్దూర్’గా రానున్నట్టు తెలుస్తోంది.