25-06-2025 12:12:34 AM
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘షో టైమ్’. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో కిషోర్ గరికిపాటి నిరిస్తున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నవీన్చంద్ర మాట్లాడుతూ.. “చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తి, ఉత్సాహం, భయం కలుగుతాయి. ప్రేక్షకులకూ అలాంటి అనుభూతినిచ్చే సినిమా ఇది” అన్నారు.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. “చిన్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉంది” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. “పరిశ్రమలో ఒక పెద్ద వ్యక్తి ఈ సినిమా చూసి ఇది రియల్ ‘షోటైమ్’ అని చెప్పారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘పొలిమేర’ డైరెక్టర్ అనిల్ విశ్వానాథ్తోపాటు దాము, రాజరవీంద్ర, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్రబృందం పాల్గొన్నారు.