10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కార్మికులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన

24-03-2025 05:16 PM

సింగరేణి వైద్యాధికారి లోకనాథ్ రెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు వేసవిలో వడదెబ్బకు గురికావద్దని ముఖ్యంగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని సింగరేణి వైద్యాధికారి లోకనాథరెడ్డి అన్నారు. ఏరియాలోని కెకె ఓసిపిలో వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ఎండలో ఎక్కువసేపు తిరిగ వద్దన్నారు. నీరు ఎక్కువ తీసుకోవాలని శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, నిమ్మరసం, పండ్ల రసాలు తాగాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలన్నారు. వేపుడు పదార్థాలు తినవద్దని మద్యపానం మాంసం తగ్గించాలని ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, బిపీ ఉన్నవారు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, కెకె ఓసిపి మేనేజర్ రామరాజు, ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి రాజేష్ కుమార్ యాదవ్, సంక్షేమ అధికారి సందీప్, అధికారులు కెకె.ఓసి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.