22 July, 2026 | 6:51 PM

Districts - Mancherial

article_48699991.webp
సింగరేణి మనుగడ కోసం కలసి పోరాడుదాం

బెల్లంపల్లి, (విజయక్రాంతి): సింగరేణి మనుగడ కోసం యూనియన్లు తమ విభేదాలను పక్కనపెట్టి పోరాటాలలో కలిసి రావాలని ఏఐటియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. 17,18న మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా శాంతిఖనిలోజరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి కంపెనీలో కనీవిని ఎరుగని రీతిలో కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేసే విధానాలను వెంటనే విరమించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మిక సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం వల్లే సమస్త మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వాపోయారు. గత 17 మాసాలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి కార్మికుల గొంతుకోసిందని విమర్శించారు.

22-07-2026

article_33051594.webp
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

లక్సెట్టిపేట: బీఆర్ఎస్ పార్టీ తరుఫున రైతలుకు అండగా ఉంటున్నామని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు(Farmers facing difficulties) పడుతున్నారని మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో(BRS Rythu Sadassu) కేటీఆర్ పేర్కొన్నారు. రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్న కేటీఆర్ బాగా వర్షం పడితే ఎస్సారెస్పీ నిండుతుందని తెలిపారు.. కడెం నుంచి ఎల్లంపల్లికి నీరు వస్తుందని వెల్లడించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ ఆరోపించారు. ఒకరోజు నీరు లేవంటారు.. రెండోరోజు మరో కథ చెబుతారని కేటీఆర్ విమర్శించారు.

21-07-2026

article_15979509.webp
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 21న నిర్వహించే పర్యటనను విజయవంతం చేయాలని కోటపల్లి మండల సోషల్ మీడియా ఇంచార్జి బాపు నాయక్ సోమ వారం కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేట మండలంలో ఇటీవల షెడ్డు కూలి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నారన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసీ రైతుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. ఈ పర్యటనను బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

20-07-2026