13-02-2026 12:00:00 AM
సనత్నగర్ ఫిబ్రవరి 12 (విజయక్రాంతి):- బాపునగర్లోని సెయింట్ విన్సెంట్ హైస్కూ ల్లో గురువారం ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన కార్యక్రమం, ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హరిసింగ్ జాధవ్, పాఠశాల నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరెడ్డినగర్ సబ్ఇన్స్పెక్టర్ సుధీర్ మా ట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, డగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.