బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి
* పలు కుటుంబాలను పరామర్శించిన జాన్సన్ నాయక్
ఉట్నూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను గ్రామస్థాయి నుంచి పెద్ద మొత్తంలో చేయించాలని ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేశారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. అనంతరం కేస్లాపూర్, దన్నోరా బి, మండల కేంద్రంలో పలువురు కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం అందించారు. ఆయనతోపాటు పిఎసిఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే, సర్పంచ్ జమున నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు జిలాని బేగ్ ల తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






