28-06-2025 12:00:00 AM
మణుగూరు, జూన్ 27( విజయ క్రాంతి ) : వర్షాకాలం ఆరంభమై నందున గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని మండలవైద్యాధికారి, శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ పిన్నింటి. నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన విజయ్ క్రాంతి తో మాట్లాడారు.
వర్షాకాలంలో వాతావరణం లో చోటుచేసుకునే ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులతో పాటు విష జ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఆరోగ్యం కాపాడుకోడానికి కాచి వడపోసిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు.
అలాగే ప్రాథమిక వైద్య కేంద్రంలో మలేరియా టెస్టులతో పాటు కొత్తగా డెంగ్యు నిర్ధారణ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావున జ్వర లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.