27-06-2025 10:46:42 PM
దౌల్తాబాద్,(విజయక్రాంతి): బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన రంగంపేట సత్తయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.