calender_icon.png 8 June, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్

07-06-2025 02:10:47 AM

ఇంజినీరింగ్ ఈఈగా హరీశ్ 

భద్రాచలం, జూన్ 6 (విజయ క్రాంతి); ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఆదేశాల మేరకు భద్రాచలం ఐ టి డి ఏ ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ (పూర్తి అదనపు బాధ్యత లు )గా హరీష్ బాధ్యతలు స్వీకరించారు.

శుక్రవారం ఐటీడీఏ ఇంజనీర్ కార్యాలయము భద్రాచలంలో డి ఈ గా విధులు నిర్వహిస్తూ భద్రాచలం ఐటీడీఏ ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా (పూర్తి అ దనపు బాధ్యతలు) బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు. 07 జూలై 2013 నుండి 2016 వరకు భూపాలపల్లి ఏటూరు నాగారం ఐటీడీఏ లో ఏఈఈ గా పనిచేసి 2018లో పాల్వంచ డివిజన్లో పనిచేశానని, డిఈఈ గా పదోన్నతి పై అక్టోబర్ 2019 వ సంవత్సరంలో అశ్వరావుపేటలో పనిచేసి ఫిబ్రవరి 2021లో భద్రాచలం ఐ టి డి ఏ లో డి ఈ ఈ గా విధులు నిర్వహిస్తూ ఇన్చార్జి ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గ శుక్రవారం బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.

ఇన్చార్జి ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా వీధులలో చేరిన హరీష్ ను కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు. నా యొక్క విధి నిర్వహణను బాధ్యతగా గిరిజనుల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానని, అందుకు ఇంజనీరింగ్ విభాగం డీఈలు, ఏ ఈ లు ,సిబ్బంది తనకు సహకరించలని ఆయన తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.