07-06-2025 02:10:29 AM
కొండాపూర్ జూన్ 06 : మీ సేవ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని కొండాపూర్ మండలం తాసిల్దార్ అశోక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మీ సేవలను తనిఖీలు చేస్తూ.. మీ సేవ కేంద్రాలు పారదర్శకంగా పనిచేయాలని, నిబంధనలు అతిక్రమించి అధిక వసూళ్లకు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరులకు స్పష్టంగా కనిపించేలా పౌర సేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ తనిఖీలలో ఆర్ ఐ లు మల్లం రాజ్, రామచందర్, మీసేవ ఆపరేటర్లు మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.