07-06-2025 02:12:03 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు(సంగారెడ్డి), జూన్ 6: ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ దేవానంద్ సొంత నిధులతో నిర్మించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయం స్వాగత తోరణాన్ని శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని అన్నారు. అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పటేల్ గూడ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. భవిష్యత్తులో మానవ మనుగడ కొనసాగాలంటే ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమాల్లో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ,, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం...
పటాన్ చెరు నియోజకవర్గంలో చేపడుతున్న నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విరాళాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలోని సీతారామ దాసంజేనేయ స్వామి దేవాలయంలో చేపట్టిన భవానీ కోటి పార్థవ పంచ ముఖ లింగేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి రూ.ఐదు లక్షల విరాళం అందించారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీర్వాచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, రాజు, రాజేష్, భక్తులుపాల్గొన్నారు.