calender_icon.png 7 June, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారం కోసమే భూభారతి

06-06-2025 12:42:49 AM

ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి 

యాచారం జూన్ 5: భూసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి అన్నారు. గురువారం మొండిగౌరెల్లి గ్రామంలో ని ర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని తెలిపారు.

ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను, సాదాబైనామా కేసులు, భూముల సమస్యలు,

భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారుల క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ అయ్యప్ప , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రైతులు, గ్రామస్తులు, తదితరులుపాల్గొన్నారు.