06-06-2025 12:40:17 AM
సింగరేణి ఎండీకి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కనీస మూలవేతనం వర్తింపజేస్తూ 12 నెలల వేతనాన్ని చెల్లించాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలారాంకు ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎండీ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతేగాక అధ్యాపక, ఉపాధ్యాయలకు సింగరేణి ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఆయనను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.