30 June, 2026 | 11:26 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బైకుల దొంగ అరెస్ట్

19-04-2025 12:47 AM

జహీరాబాద్, ఏప్రిల్ 18 :జహీరాబాద్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ బైకులు దొంగతనం చేసే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు బస్టాండ్ ముందు సిగ్నల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీరాబాద్ సుభాష్ గంజికి చెందిన మొహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

జహీరాబాద్ లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, గత సంవత్సరం నుండి బైకులు దొంగతనం చేస్తున్నాడని చెప్పారు. దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని తప్పించుకునేందుకు కత్తితో బెదిరించైనా లేక వారిని చంపడానికి చాకు, కమ్మ కత్తిని ఉపయోగిస్తుంటాడని ఆయన తెలిపారు.

జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ కాశీనాథ్ సీసీ కెమెరాలు, వాహనాల తనిఖీ ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు.

నిందితుని వద్ద ఎనిమిది మోటార్ సైకిళ్లు, చాకు, కమ్మ కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడానికి ఐడి పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుళ్లు సంజీవరావు, ఓం దేవ్, అస్లాం, ఆనంద్ను డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిఅభినందించారు.