calender_icon.png 14 May, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలు

13-05-2025 12:00:00 AM

  1. ఒకరిది స్క్రిప్ట్.. మరొకరిది డెలివరీ 
  2. ధనిక రాష్ట్రం అంటూనే ఆగం చేశారు
  3. ఉన్న విషయాన్నే సీఎం ప్రజల ముందుంచారు
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 12 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలని, ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే మరొకరు డెలివరీ చేస్తారని, ఢిల్లీ స్థాయిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. సొమ వారం ఉదయం ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ధనిక రాష్ట్రం అంటూ గత పాలకులు షో చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లోగుట్టు మొత్తం బయటపడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా చూసి బాధేసిందని, దాదాపు రూ.8 లక్షల 19 కోట్ల అప్పు ఉందని వెల్లడించారు.

ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారని, ఈరోజు ఉన్న పరిస్థితిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు తెలియాలనే చెప్పారన్నారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ నేతల మాటలకు పొంగులేటి గట్టి కౌంటర్ ఇచ్చారు. 90 శాతం పనులు పూర్తిచేస్తే ఇంకా 40 శాతం పనులు ఎలా మిగిలి ఉంటాయని ప్రశ్నించారు. కనీసం డ్రైరన్ కూడా చేయని బీఆర్‌ఎస్ నాయకులు మోటార్లు బిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

కుట్రలు జరుగుతున్నాయి

కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని విపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నాయని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరవెనుక ఉండి కొందరు రైతులను ఉసిగొలుపుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ధ్వజమెత్తారు. ఎవరెవరు కుట్రలకు పాల్పడుతున్నారో అన్ని విషయాలు అధికారుల వద్ద పూర్తి సమాచారంతో ఉందన్నారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, ఇకనైనా సక్రమంగా మసలుకోవాలని హితవు పలికారు. 

రివర్ ఫ్రంట్ కాలనీతో భరోసా

గతేడాది అకాల వర్షాలకు మున్నే రు పరీవాహక ప్రాంతాల్లోని కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయ ని, సీఎం రేవంత్‌రెడ్డి సహా అనేక మంది మంత్రులు మున్నేరు బాధితులను పరామర్శించి, ఆదుకుని రిటైనిం గ్ వాల్ నిర్మా ణ పనులను వేగం చేశామన్నారు. తక్కువ ధరకు వస్తుందని ఇక్కడ భూములు కొని ఇండ్లు కట్టుకున్న పేదలకు రిటైనింగ్ వాల్‌తో భరో సా ఉంటుందన్నారు.

ఏ ఒక్కరికీ అనా ్యయం జరుగకుండా రివర్ ఫ్రంట్ కాలనీలో చోటు కల్పిస్తామని చెప్పా రు. 450 నుంచి 500 ఎకరాల్లో ఇం డ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భా విస్తున్నది రిటైనింగ్ వాల్ నిర్వాసితులకు అందులో స్థానం కల్పిస్తామని చె ప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మే రకు రెండు వైపులా 17 కిలోమీటర్ల మే ర భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా శాశ్వత పరిష్కారంగా రిటైనిం గ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో భూ ములున్న ఆసాములు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.