03-06-2025 08:36:42 PM
అధ్యక్షులుగా తాళ్లపల్లి మధు..
పెన్ పహాడ్: బీజేపీ మండల నూతన కమిటీ ఎన్నిక సోమవారం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు(BJP State Vice President Sankineni Venkateshwar Rao) ప్రకటించారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల బీజేపీ మండలాధ్యక్షులుగా తాళ్లపల్లి మధు, మండల ప్రధాన కార్యదర్శులుగా బొలిశెట్టి పిచ్చయ్య, గూడపూరి శ్రీను, ఉపాధ్యక్షులుగా బొంత ఉపేందర్, మామిడి సంధ్య, చామకూరి వెంకటేష్, నాగరాజు కార్యదర్శులుగా తాడోజి జనార్ధన చారి, బొల్లక సైదులు, ఎరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, మామిడి మౌనిక, కోశాధికారిగా జూలకంటి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నిక కాగా నూతన కమిటీని సంకినేని శాలువాలు కప్పి సత్కరించారు.