ముంబై రైళ్లకు బాంబు బెదిరింపులు
ఉత్తరప్రదేశ్: ముంబైకి వెళ్లే రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో ఉత్తరప్రదేశ్లోని రెండు వేర్వేరు స్టేషన్లలో రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ రైల్వే పోలీసు (Government Railway Police) అధికారుల ప్రకారం, బల్లియా నుండి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు కామయాని ఎక్స్ప్రెస్లో బాంబులు ఉన్నట్లు సమాచారం. అధికారులు ఈ ముప్పును తీవ్రంగా పరిగణించి సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో పోస్ట్ చేసిన జీఆర్పీ మీడియా ఇన్ఛార్జ్ శ్యామ్ బాబు తెలిపారు.
కమయాని ఎక్స్ప్రెస్ను బల్లియా రైల్వే స్టేషన్(Kamayani Express to Ballia Railway Station)లో నిలిపివేసినట్లు, దాదర్ ఎక్స్ప్రెస్ను క్షుణ్ణంగా భద్రతా తనిఖీల కోసం ఆధిహార్ రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు తెలిపారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్, GRP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force )తో కూడిన ఉమ్మడి ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. బల్లియా రైల్వే స్టేషన్(Ballia Railway Station)లో డాగ్ స్క్వాడ్ను కూడా మోహరించినట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లే రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో బాంబులు అమర్చినట్లు సోషల్ మీడియా(Social media)లో వార్తలు రావడంతో భారీ భద్రతా తనిఖీలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.




