15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆకాశవాణిలో... బొమ్మనపల్లి విద్యార్థుల గళం

26-03-2025 06:07 PM

టేకులపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో కదంబ కార్యక్రమాన్ని ఇచ్చి తమ ప్రతిభను చాటిచెప్పారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో తమ ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. పాటలు, గేయాలు, సామెతలు, కథలు, ఇంగ్లీష్ రైమ్స్, పొడుపు కథలు, నాటికల ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొమ్మనపల్లి చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులు ఈ అత్యుత్తమ ప్రతిభను ఆకాశవాణిలో ద్వారా చాటిచెప్పారు. ఐదో తరగతి విద్యార్థిని డి. ఊహ అద్భుతంగా యాంకరింగ్ చేసింది. పాఠశాల హెచ్ఎం ఎం.జ్యోతిరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కదంబ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొని తమ గళాన్ని ఆకాశవాణి ద్వారా వినిపించారు. హెచ్ఎం ఎం.జ్యోతిరాణి కూడా భద్రాద్రి జిల్లాలో బాలమేళాపై ఆకాశవాణిలో సమీక్ష ప్రసంగం ఇచ్చారు.