17 April, 2026 | 2:13 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

గోదావరిఖనిలో వాహనం ఢీకొని బాలుడు మృతి

20-04-2025 09:37 PM

గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖని మంచిర్యాల్-ప్రధాన రహదారి గంగానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందినట్లు 1- టౌన్ ఎస్ఐ భూమేష్(SI Bhoomesh) ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ఉదయం పులిపాక శివరాజ్ కుమార్(3) ఆడుకోవడానికి ప్రధాన రహదారి పైకి రాగా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన కారు అ బాలుడినీ ఢీకొనడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్ళగా వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి చెందాడని తెలుపగా, తండ్రి పులిపాక రమేష్ ఫిర్యాదు మేరకు(కారు) కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.