6 May, 2026 | 11:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కు కాంస్యం

08-08-2024 08:07 PM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం పతకం దక్కింది. భారత పురుషుల హాకీ జట్లు కాంస్య పతక పోరులో స్పెయిన్ పై భారత్ గెలుచుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత హాకీ జట్టు కాంస్యం గెలిచింది. కాగా, తాజాగా హాకీలో సాధించిన కాంస్యంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన పతకాల సంఖ్య 4కు పెరిగింది. ఇంతకుముందు షూటింగ్ లో మూడు పతకాలు వచ్చాయి. 10 మీటర్ల మహిళల వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ లో మాను భాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో మనుభాకర్-సరభ్ జోత్ సింగ్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే కాంస్యాలు సాధించారు.