కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త
06-05-2026 09:37 PM
కోదాడ,(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో కోదాడ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఎదుట ప్రజలందరూ చూస్తుండగా భార్యను భర్త కత్తితో పొడిచిన చంపిన దుర్ఘటన బుధవారం చోటుచేసుకుంది.చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన మణిదీప్ జగ్గయ్యపేటకు చెందిన తన భార్య శిరీషను బస్టాండ్ ఎదుట బయటకు గుంజి కత్తితో పొడవగా కోదాడ ప్రభుత్వ దవఖానకు తీసుకెళుతున్న క్రమంలో దుర్మరణం పాలయింది.. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






