సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన
- ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోయబ్
సిద్దిపేట క్రైం: యువతకు సామాజిక బాధ్యత పట్ల అవగాహన, చైతన్యం తేవడమే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్(ఎంపీజే) లక్ష్యమని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోయబ్ చెప్పారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎంపీజే కృషి చేస్తుందని చెప్పారు.
రోజుల తరబడి జైల్లోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలను విడిపించడానికి ఎంపీజే బాధ్యత తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సరిచూడడానికి, కొత్త ఓటర్లను చేర్చడానికి ఇంటింటికి తిరిగి నిర్వహించే కార్యక్రమం(ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్) కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఎంపీజే నూతన కమిటీని ఏర్పాటు చేశారు.






