17 April, 2026 | 3:21 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీఎస్పీ మండల కమిటీ నియామకం

08-04-2025 08:14 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్షేట్టిపేట మండల కమిటీ ని మంగళవారం స్థానిక గురునానక్ గార్డెన్స్ లో జోనల్ కో -ఆర్డినేటర్ కాదాసి రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా జోనల్ కో-ఆర్డినేటర్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగంను, బహుజన సమాజపు హక్కులను కాపాడేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి కృషి చేసేదే బీఎస్పీ అని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికే కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా పని చేయడమే బీఎస్పీ లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులుగా బెక్కం సృజన్, ప్రధాన కార్యదర్శి గా దీటి శరత్ కుమార్, ట్రెజరర్ గా బోనగిరి మహేష్,జాయింట్ సెక్రటరీగా చిప్పకూర్తి సంతోష్, సభ్యులు చొప్పదండి ప్రశాంత్, మెడపట్ల శ్రీ వరుణ్, బిరుదుల రవి,అడ్లూరి రాజశేఖర్, బంటి, సంజయ్, శేఖర్,కొల్లూరి ప్రశాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.