calender_icon.png 20 February, 2026 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండాకాలంలో నర్సరీలోని మొక్కలు ఎండకుండా చూసుకోవాలి

20-02-2026 01:48:48 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): మండలంలోని వదల్పర్తి,మాల్తుమ్మెద గ్రామాలలో గల నర్సరీలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ....ఎండాకాలంలో నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని,ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో సరిపడ నీటిని అందించాలన్నారు.నర్సరీలోని మొక్కల పెంపకంలో గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు.

నర్సరీలో అన్ని రకాల మొక్కలు పెంచాలన్నారు.అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో సీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ గ్రామ సంఘాలలో తీసుకున్నటువంటి లోన్లను పూర్తిస్థాయిలో రికవరీ చేసి కొత్తవారికి కొత్త లోన్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సాయిలు, ఫీల్ అసిస్టెంట్లు, నర్సింలు, సాయిలు, స్వప్న, సీసీలు నారాయణ, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.