20-02-2026 01:50:01 AM
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామ కార్యదర్శి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తహరా బేగం అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న వేసవికాలంలో యాక్షన్ ప్లాన్ ముందస్తు ప్రణాళికను ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేర బేగం, పంచాయతీ కార్యదర్శులతో తయారు చేశారు.
ప్రత్యేక సమావేశంలో భాగంగా గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యవంతం చేయాలని తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శుల కు సూచించారు. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాలలో తాగినీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పంచాయతీ పరిధిలో నర్సరీలో పర్యవేక్షణ పై ప్రత్యేకంగా చర్చించారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో విధులు నిర్లక్ష్యం వహించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పట్ల అధికారులు ఆ శ్రద్ధ విడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్, ఏపీవో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.