22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

చర్చ్ ఫాదర్‌పై హత్యయత్నం కేసులో 18 మందికి జరిమాన

13-09-2024 08:27 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ వేములవాడ సబ్ జడ్జి రాధికా జైశ్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించారని వేములవాడ పట్టణ ఇన్స్ పెక్టర్ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలోని చర్చ్ లో ఫాదర్ గా పని చేస్తున్న బ్రదర్ సువర్ణ పాల్ పై అదే చర్చ్ లో ఫాదర్ గా పని చేసి తొలగించబడిన తిమేతి అనే వ్యక్తి తనను తీసివేయడానికి కారణం అని అతనిని చర్చ్ నుండి ఎలాగైనా కాళీ చేపించాలని 2015 సంవత్సరం లో అక్రమంగా తన అనుచరులు 17 మందితో కలసి  బ్రదర్ సువర్ణపాల్ పై హత్యప్రయత్నం చేశారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైశ్వాల్ తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు.