29-06-2025 02:33:51 AM
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ కే లక్ష్మణ్
నల్లగొండ టౌన్, జూన్ 28 (విజయక్రాం తి): దేశాన్ని 64 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణనను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయ సమస్యలు రాకుండా కులగణనను చేపట్టనుండటం కీలకమైన చర్య అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘కులగణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామాజిక న్యాయం’ అనే అంశంపై బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నల్లగొండలోని స్టే ఇన్ హోటల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1931 అనంతరం దేశంలో కులగణన జరగలేదన్నారు. 1951లో జరగాల్సిన కులగణనను అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని విమర్శించారు. ఇలా బీసీల హక్కులను కేం ద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి బీసీల హక్కులను తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం కాలరాసిందని ధ్వజమెత్తారు.
ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లింలకు తాము వ్యతిరేకం కాదన్నారు. బీసీల కోసం కులగణన అవసరమని నొక్కి చెబుతూ వివి ధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, నిపుణుల సలహాలు, సూచనలతో నివేదిక ను తయారుచేసి కేంద్రంలోని సామాజిక, న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించనున్న ట్టు తెలిపారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్గౌడ్, గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.