29-06-2025 02:32:27 AM
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
వేములపల్లి, జూన్ 28: కుటుంబ కలహాలతో కోడలు కర్రతో దాడి చేయడంతో అత్త మృతి చెందింది. వేములపల్లి మండలం సల్కునూరులో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం గుర్రం అంజమ్మ (72)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు నాగయ్య భార్య పార్వతమ్మతో మూడు రోజుల క్రితం ఇంటి సమస్య విషయమై గొడవ జరిగింది.
దీంతో పార్వతమ్మ అత్త అంజమ్మ తలపై కర్రతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి తరలించగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ హాస్పిటల్కి తరలించగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం అంజమ్మ మృతి చెందింది.