10-06-2025 06:20:04 PM
సూరయ్యపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు..
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సోదరుడు యువ నాయకులు దుద్దిళ్ళ శ్రీను బాబు(Duddilla Srinu Babu)కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సూరయ్యపల్లి రోడ్ వద్ద భారీ బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు నిర్వహించారు.
శ్రీను బాబు నియామకానికి సహకరించిన సోనియా గాంధీ, రాహుల్ గాందీ, మల్లికార్జున కార్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కెసీ వేణుగోపాల్ కు తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి సూరయ్యపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. రాబోయో రోజుల్లో దుద్దిళ్ల కుటుంబం మరెన్నో గొప్ప పదవులు అందుకోవాలని, పేద ప్రజల ఆపద్బాంధవుడు వారి యొక్క సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు ఆరోగ్య అవసరాలను తీర్చే విధంగా శ్రీనుబాబు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ, యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.