10-06-2025 06:22:01 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మతిస్థిమితం లేక తిరుగుతున్న ఓ యువకుడిని పట్టణానికి చెందిన ఇరువురు యువకులు చేరదీశారు. మంగళవారం మార్కెట్ ఏరియాలో అటుఇటు తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని స్థానికంగా వ్యాపారం చేసుకునే యువకులు గూడూరు రాజ్ కుమార్, ఆవునూరి ప్రశాంత్ లు చేరదీసి పిచ్చిగా పెరిగిన వెంట్రుకలను తీయించి, స్నానం పోసి నూతన వస్త్రాలు అందజేశారు. భోజనం ఏర్పాటు చేశారు. యువకులు చేసిన పనికి మార్కెట్ లోని వ్యాపారులు అభినందించారు.