24 March, 2026 | 8:35 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ఆ దేశానికి వెళ్ళొద్దని కేంద్రం సీరియస్ వార్నింగ్

05-08-2024 10:29 AM

న్యూఢిల్లీ: ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 90 మందికి పైగా మరణించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారత్ తన పౌరులను కోరింది. బంగ్లాదేశ్‌లోని పరిణామాలపై భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి భారతీయులు ఎవరు వెళ్ళొద్దని కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కోరింది. సురక్షిత ప్రాంతాలకు పరిమితం కావాలని సూచించింది.

బంగ్లాదేశ్‌లో వివక్ష వ్యతిరేక విద్యార్థుల ఉద్యమం ఆదివారం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత రాజధాని ఢాకా, బంగ్లాదేశ్‌లోని నగరాల్లో ఘర్షణలు జరిగాయి. 14 మంది పోలీసులతో సహా మొత్తం 97 మంది మరణించారు. వందలాది మంది గాయపడినట్లు సమాచారం. కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢాకాలోని భారత హైకమిషన్‌తో అత్యవసర +8801958383679, +8801958383680, +8801937400591 ఫోన్ నంబర్‌ల ద్వారా సంప్రదించాలని తెలిపింది.