17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన సీఐ జగడం నరేష్

07-04-2025 10:47 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, కోర్టు బయటే రాజి మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ కమ్యూనిటీ మేడియేషన్ సెంటర్ సభ్యులు సహకరిస్తారన్నారు. ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మండలానికి నలుగురు కమ్యూనిటీ మీడియేషన్ వాలంటరీగా వాజిద్ హుస్సేన్, జి శైలేష్, ఎండి రిజ్వాన్, హుండే బస్వరాజ్ లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాల్ బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, అడ్వకేట్ మల్లేశ్వర్, విట్టల్ రావు అడ్వకేట్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.