10 April, 2026 | 2:29 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలి

14-11-2025 07:23 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్ ను ఆసుపత్రి పర్యవేక్షకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం ఆర్ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేసి శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి ప్రతిరోజు వైద్య చికిత్స కొరకు ప్రజలు వస్తుంటారని, వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఆర్.ఓ. ప్లాంట్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్రజలు ఆర్.ఓ. ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.