calender_icon.png 16 June, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రభుత్వ వైద్య కళాశాలలపై సీఎం రేవంత్ సమీక్ష

16-06-2025 04:02:58 PM

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యాకళాశాలల(Government Medical Colleges)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య కళాశాలలపై ఎన్ఎంసీ లేవనెత్తిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పని చేయాలని, కమిటీ వేసి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిటీ ప్రతి కాలేజీకి వెళ్లి పూర్తి వివరాలతో పాటు బోధనా ఆసుపత్రుల్లో పడకల పెంపుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. వైద్య కళాశాలల్లో నియామకాలు, పదోన్నతులు పూర్తి చేయాలని, మెడికల్ కాలేజీలకు అవసరమైన నిధులను వెంటనేనా ఆసుపత్రుల్లో పడకల పెంపుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. వైద్య కళాశాలల్లో నియామకాలు, పదోన్నతులు పూర్తి చేయాలని, మెడికల్ కాలేజీలకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, అనుమతులకు జేపీ నడ్డాను సంప్రదించాలని, నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలని చెప్పారు. జపాన్ లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని, ప్రతినెలా మూడో వారంలో వైద్య, విద్య శాఖలపై సమీక్ష ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.